నియోజకవర్గంలో పంట నష్టం పై సమీక్షా సమావేశం.!

నియోజకవర్గంలో పంట నష్టం పై సమీక్షా సమావేశం.!

- మొందా తుఫాన్ ప్రభావం.
- రైతుల సమస్యలపై చర్చ.

సత్తుపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు, సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు (ఏఓలు), సహాయక వ్యవసాయ అధికారులు (ఏఈఓలు) పాల్గొన్నారు.

మొందా తుఫాన్ ప్రభావం వలన తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను స్వయంగా పరిశీలించి, రైతుల సమస్యలను అర్థం చేసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల ఏఓలు, ఏఈఓలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


WhatsApp Image 2025-11-01 at 7.50.50 PMవరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేయాలని, గత సీజన్‌లో చోటు చేసుకున్న సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

రైతుల పక్షాన పలు అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించబడింది. సత్తుపల్లి నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి నివేదికను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రికి పంపించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .