కార్తీక మాసం తొలి రోజు కీసరగుట్టలో భక్తుల రద్దీ

కార్తీక మాసం తొలి రోజు కీసరగుట్టలో భక్తుల రద్దీ

కీసర, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

కార్తీక మాసం ప్రారంభమైన తొలి రోజునే మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర మాసంలో తెల్లవారు జామున నుంచే కుటుంబ సమేతంగా భక్తులు స్వామి దర్శనార్థం తరలివచ్చారు.
WhatsApp Image 2025-10-22 at 6.41.23 PMఆలయ ప్రాంగణం భక్తి భావంతో కళకళలాడగా, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆకాశ దీపం దర్శించేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు.భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు సమకూర్చినట్లు చెప్పారు.గత ఏడాదితో పోలిస్తే ఈసారి కార్తీక మాసంలో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .