కార్తీక మాసం తొలి రోజు కీసరగుట్టలో భక్తుల రద్దీ

కార్తీక మాసం తొలి రోజు కీసరగుట్టలో భక్తుల రద్దీ

కీసర, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

కార్తీక మాసం ప్రారంభమైన తొలి రోజునే మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర మాసంలో తెల్లవారు జామున నుంచే కుటుంబ సమేతంగా భక్తులు స్వామి దర్శనార్థం తరలివచ్చారు.
WhatsApp Image 2025-10-22 at 6.41.23 PMఆలయ ప్రాంగణం భక్తి భావంతో కళకళలాడగా, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆకాశ దీపం దర్శించేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు.భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు సమకూర్చినట్లు చెప్పారు.గత ఏడాదితో పోలిస్తే ఈసారి కార్తీక మాసంలో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!