దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీకి తరలిరావాలి.

గవాయ్ పై దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగానే చూస్తం.

దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీకి తరలిరావాలి.

 -తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ.

 హైదరాబాద్,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు): 

 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  గవాయ్ పై ఇటీవల జరిగిన దాడిని రాజ్యాంగం పై జరిగిన దాడిగానే చూస్తామని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ అన్నారు. గురువారం హైదరాబాదులోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై దాడి జరిపిన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తిపై నేటికీ కేసు నమోదు చేయకపోవడం దళితులను అవమానించడమేనని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దళితులు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. నవంబర్ 1న హైదరాబాదులో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీకి దళితులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు  అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లెపాక రాజేష్, రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్, రాష్ట్ర నాయకులు బొట్ల సదానందం ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .