చర్లపల్లిలో సి.సి. రోడ్డు పనుల పరిశీలన 

అభివృద్ధి పనులపై నేతల సమీక్ష

చర్లపల్లిలో సి.సి. రోడ్డు పనుల పరిశీలన 

చర్లపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చర్లపల్లి గ్రామంలో జరుగుతున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులను బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు నేమూరీ మహేష్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ప్రారంభమైన ఈ రోడ్డు పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు సులభ రవాణా సౌకర్యం కలుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “చర్లపల్లి డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, నీటి సరఫరా వంటి పౌర వినియోగ సౌకర్యాల అభివృద్ధికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారు. ప్రాంతీయ ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా పనులు చేపడుతున్నారు. గ్రామ, డివిజన్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు కూడా త్వరలోనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.WhatsApp Image 2025-11-01 at 8.25.00 PMప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదయ్య, లక్ష్మయ్య, బాబు, రాములు, అనిల్‌కుమార్, బాలకృష్ణ, శ్రీనివాస్, భాను, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!