ఓయూలో మంత్రి వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు
నాచారం, నవంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఓయూ బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, "బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వాకిటి శ్రీహరి. బీసీ వర్గాల కోసం 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆయనకు భగవంతుడు మరింత శక్తి, సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. రెండు కోట్లకుపైగా బీసీ ప్రజల ఆశీర్వాదం, అండ ఆయనతో ఉంది" అని పేర్కొన్నారు. బలహీన వర్గాల తరపున బలమైన స్వరంగా నిలుస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.కార్యక్రమంలో రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్, బొల్లేపల్లి స్వామి గౌడ్, అల్లుడు జగన్ ముదిరాజ్, బైరు నాగరాజు గౌడ్, భీమ్ రావు, కొమ్మానబోయిన సైదులు, కాంపాటి వెంకట్ గౌడ్, శ్రీకాంత్, తిమ్మానగరం వెంకట్, రఘు, చేర్యాల వంశీ, కౌశిక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.


Comments