గాలి కుంటు టీకాలు తప్పనిసరి – నిర్లక్ష్యం చేయొద్దు.

జిల్లా పశువైద్య అధికారి.

గాలి కుంటు టీకాలు తప్పనిసరి – నిర్లక్ష్యం చేయొద్దు.

సత్తుపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండల పరిధిలోని సిద్దారం, గౌరీగూడెం గ్రామాల్లో జరుగుతున్న ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ బోడేపూడి శ్రీనివాస్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడిరైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలి కుంటు వ్యాధి టీకాలు వేయించాలి. టీకాలు వేయించకపోతే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. ఆవులు, ఎద్దులు గాలి కుంటు వ్యాధికి గురైతే పాల ఉత్పత్తి తగ్గి, పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది అని హెచ్చరించారు.WhatsApp Image 2025-11-01 at 4.40.47 PM

నాలుగు నెలలు దాటిన దూడలు, పశువులకు ఈ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలని సూచించారు. రైతులు ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవంబర్ 13 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో మండల పశువైద్య అధికారి డాక్టర్ చింతనిప్పు శశిదీప్, లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు వి. చైతన్య, డి. కరుణాకర్, వి. సాధిక్, ఎస్‌.కె. లాల్ బీ, ఓఎస్‌లు రాధా, మల్లికార్జున్, నాగేశ్వరరావు, శ్రీను, గోపాలమిత్ర సిబ్బంది రామకృష్ణ, సైదులు, విజయ్, రవి, శేషగిరి, చెన్నారావు, కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .