పెద్దమందడి నూతన ఎంపీడీవో పరిణతను కలిసిన కాంగ్రెస్ మండల నాయకులు

పెద్దమందడి నూతన ఎంపీడీవో పరిణతను కలిసిన కాంగ్రెస్ మండల నాయకులు

పెద్దమందడి,నవంబరు01(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల ప్రజా పరిషత్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో పరిణత ను శనివారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు శాలువాతో సన్మానించి, ఎంపీడీవోను అభినందించారు.

కాంగ్రెస్ నేతలు ఎంపీడీవోని మండల అభివృద్ధికి సహకరించాలని, వివిధ గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి, తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతల్లో చీకరు చెట్టు తాండ గ్రామ మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, పామిరెడ్డిపల్లి గ్రామకు చెందిన మధిర శ్రీశైలం, చిన్న మందడి గ్రామానికి చెందిన వాకిటి రవి, ఎంపీడీవో సిబ్బందిలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!