తెలంగాణ ముచ్చట్లు కథనానికి అధికారుల స్పందన
చెరువు అంచున రక్షణ పిల్డర్ల ఏర్పాటు, పనులు పూర్తి
ఎల్కతుర్తి,అక్టోబర్ 20(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ చెరువు పై ఉన్న రహదారి ప్రమాదకరంగా మారిందని తెలంగాణ ముచ్చట్లు దినపత్రికలో గత వారం ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు.
చెరువు అంచున ఉన్న రహదారి వద్ద రక్షణ పిల్డర్లు కూలిపోవడంతో వాహనదారులు భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పత్రిక వెలుగులోకి తీసుకురాగానే అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు.
మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేసి, కొత్త రక్షణ పిల్డర్లను బలంగా ఏర్పాటు చేశారు.స్థానికులు మాట్లాడుతూ....“చెరువు నిండిన సమయంలో బస్సులు, ఆటోలు, పాఠశాల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా ఉండేది. అధికారులు వెంటనే స్పందించి పిల్డర్లు నిర్మించడం మాకు చాలా ఉపశమనం కలిగించింది” అని తెలిపారు.అదేవిధంగా తమ సమస్యను ప్రజా దృష్టికి తీసుకువచ్చిన తెలంగాణ ముచ్చట్లు పత్రికకు గోపాల్పూర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


Comments