పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం
నాచారం, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ మల్కాజ్గిరి డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో మల్లాపూర్లోని వీ.ఎన్.ఆర్ గార్డెన్స్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఘట్కేసర్ ఏసీపీ చక్రపాణి, సీఐ బాలస్వామి, ఎస్ఐ హీనా పాల్గొని రక్తదాతలను అభినందించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సేవలను చిరస్మరణీయంగా నిలుపుకోవాలన్నారు.
సమాజంలో రక్తదానం అత్యంత మహత్తర సేవ అని, ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.శిబిరంలో ఘట్కేసర్ మైనార్టీ యువత, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతల తో పాటు పోలీస్ సిబ్బంది కూడా రక్తదానం చేస్తూ సేవాస్ఫూర్తిని చాటారు.


Comments