నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు

వరి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు

పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):

రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.

పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి పల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి సాగుచేసిన వరి పంటను బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు స్థానిక వ్యవసాయ అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి మాట్లాడుతూ.. డి.ఆర్.ఆర్–75 సీడ్ వరి విత్తనాలను వాడడంతో అధిక దిగుబడి వచ్చింది. ఒక్క ఎకరాకు సుమారు 50 క్వింటాళ్ల వరకూ పంట దిగుబడి నమోదైంది అని తెలిపారు.

దిగుబడి అధికంగా రావడంతో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి రైతులు పెద్దఎత్తున వచ్చి ఈ వరి పంటను పరిశీలించారు. వారు సీడ్ విత్తనాల వివరాలు తెలుసుకున్నారు.

రైతులకు నాణ్యమైన వరి విత్తనాలు అవసరమైతే ఫోన్ నంబర్‌: 9908161633 కు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.అధిక దిగుబడి కోసం తప్పనిసరిగా నాణ్యత కలిగిన విత్తనాలను మాత్రమే వాడాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .