నిద్రపోతున్న నిఘానేత్రాలు !

పట్టించుకోని అధికారులు

నిద్రపోతున్న నిఘానేత్రాలు !

ప్రశ్నార్థకంగా పలు గ్రామాల భద్రత
 
•వేలేరు మండలంలో ఇటీవల  దొంగతనాలు
 
వేలేరు,అక్టోబర్21(తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలంలోని పీచర, గుండ్లసాగర్, కన్నారం, కమ్మరిపేట వంటి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో గ్రామాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కెమెరాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
 
కొన్ని గ్రామాల్లో కెమెరాలకు ఏర్పాటు చేసిన బాక్స్‌లు పక్షులకు గూళ్లుగా మారి ఉండడం, భద్రతా వ్యవస్థ పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ నిఘానేత్రాలు నిష్క్రియంగా మారడం పట్ల ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
“గ్రామాల భద్రత కోసం ఏర్పాటైన సీసీ కెమెరాలు పనిచేయకపోతే ప్రజల రక్షణ ఎలా సాధ్యం?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిని దొంగలు సద్వినియోగం చేసుకుంటూ వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో బర్లు, గొర్రెలు, మోటార్లు దొంగిలించబడిన ఘటనలు చోటు చేసుకున్నాయని వారు గుర్తు చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని సీసీ కెమెరాలను మరమ్మతు చేసి, అవి పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .