ప్రమాద బాధితుడిని పరామర్శించిన తుమ్మల యుగంధర్.

సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.

ప్రమాద బాధితుడిని పరామర్శించిన తుమ్మల యుగంధర్.

సత్తుపల్లి, నవంబర్‌ 1 (తెలంగాణ ముచ్చట్లు):

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో అక్టోబర్‌ 24న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన సత్తుపల్లి పట్టణానికి చెందిన మన్నేపల్లి సత్యనారాయణను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ శనివారం పరామర్శించారు.

హైదరాబాద్‌లోని డి.ఆర్.డి.ఓ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న సత్యనారాయణ అధికార పనిమీద హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తుండగా ఆయన ప్రయాణించిన బస్సు కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కాగా, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పించుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న తుమ్మల యుగంధర్ స్వయంగా సత్యనారాయణ నివాసానికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.

ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు రాజబాబు, విద్యాసంఘ నాయకులు నాయుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!