కుషాయిగూడలో అమరవీరు ల సంస్మరణ ర్యాలీ

కుషాయిగూడలో అమరవీరు ల సంస్మరణ ర్యాలీ

కుషాయిగూడ, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుండి తాళ్లూరి క్రాస్ రోడ్ వరకు సాగిన ఈ ర్యాలీలో సుమారు 90 మంది కళాశాల విద్యార్థులు, యువత మరియు స్థానికులు పాల్గొన్నారు.తాళ్లూరి క్రాస్ రోడ్ వద్ద అమరవీరులకు ఒక నిమిషం మౌన నివాళి అర్పించారు. అనంతరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎన్. రామ లక్ష్మణ రాజు మాట్లాడుతూ... దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారాయన. యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందేలా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ట్రాఫిక్ అవగాహన కీలకమని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌హెచ్‌ఓ ఎన్. రామ లక్ష్మణ రాజు, ఎస్‌ఐలు జి. మధు, లింగారెడ్డి, భాస్కర్ తదితరులు విజయవంతంగా నిర్వహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!