రూ.92 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణం పరిశీలన
కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.భరత్ నగర్ బురుజు గల్లీలో రూ.92 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప్పల్ డివిజన్లోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
“ప్రతి గల్లీ, ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తూ ఉప్పల్ డివిజన్ను సమస్యలేని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతాము” అని రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ రాజ్కుమార్, సల్లా ప్రభాకర్ రెడ్డి, పాలడుగు లక్ష్మణ్, యేరా శ్రీనివాస్, సోమ బాలమణి, మోత్కూరి శ్రీహిత్ బాబీ, జిత్తు రెడ్డి, కొత్త వంశీ, మేకల రామ్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, పిన్నిటి భూపాల్ రెడ్డి, కొత్త మలేష్ గౌడ్, ధర్మ రెడ్డి, దశరత్ కురుమ, తమ్మాలి రాజు, తమ్మాలి కిషోర్, పుల్ల ప్రభాకర్, గొండి ప్రశాంత్ రెడ్డి, సుడుగు నవీన్ రెడ్డి, ముత్తంగరి రామ్, హరి యాదవ్, సోమ మలేష్, అడపా గౌతమ్, బజార్ నవీన్ గౌడ్, టైసిన్, బురుజురవి, కేమిడి ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. 


Comments