ఒకవైపు అద్భుతమైన చౌరస్తా

మరోవైపు గుంతలతో  నిండిన రహదారి 

ఒకవైపు అద్భుతమైన చౌరస్తా

ఎల్కతుర్తి,అక్టోబర్22(తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చౌరస్తాను అధికారులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పూల మొక్కలు, పచ్చదనం, రాత్రివేళ వెలుగులు చిమ్మే లైట్లతో చౌరస్తా అందంగా కనిపిస్తోంది. అయితే అదే చౌరస్తాకు కూతవేటు దూరంలో ఉన్న ఎల్కతుర్తి–హుస్నాబాద్ ప్రధాన రహదారి మాత్రం దారుణ పరిస్థితుల్లో ఉంది.

మధ్యలోనే రహదారి పనులు ఆపివేయడంతో దుమ్ము,ధూళి, గుంతలతో మారుమూల గ్రామాల రోడ్లకంటే దారుణంగా మారిపోయింది. ప్రధాన రహదారి కావడంతో తరచూ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని సార్లు ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు కోరుతున్నారు.



WhatsApp Image 2025-10-22 at 5.30.36 PMWhatsApp Image 2025-10-22 at 5.30.35 PMదుమ్ము,ధూళితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం స్థానికురాలు ఎండి యాకూబి  స్థానికురాలు ఎండి యాకూబి మాట్లాడుతూ…“ఎల్కతుర్తి–హుస్నాబాద్ రహదారి మధ్యలోనే ఆపేయడంతో దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తినే ఆహార పదార్థాల్లో కూడా దుమ్ము పడుతోంది. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. ఈ రహదారి వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నాం” అని వాపోయారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!