అమర వీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం.

పోలీసు దినోత్సవం సందర్బంగా నివాళులు.

అమర వీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం.

సత్తుపల్లి, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

బి.గంగారం వద్ద ఉన్న 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో మంగళవారం పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శ్రీ ఎన్. పెదబాబు పాల్గొని విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్మృతిపరేడ్ నిర్వహించి అమర వీరులకు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ దినోత్సవం పోలీసు శాఖ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొని సమాజ రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ శ్రీ ఏ. అంజయ్యతో పాటు అధికారులు, కానిస్టేబుళ్లు, హోం గార్డులు పాల్గొని అమర వీరులకు నివాళులు అర్పించారు.IMG-20251021-WA0030

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!