అమర వీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం.

పోలీసు దినోత్సవం సందర్బంగా నివాళులు.

అమర వీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం.

సత్తుపల్లి, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

బి.గంగారం వద్ద ఉన్న 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో మంగళవారం పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శ్రీ ఎన్. పెదబాబు పాల్గొని విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్మృతిపరేడ్ నిర్వహించి అమర వీరులకు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ దినోత్సవం పోలీసు శాఖ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొని సమాజ రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ శ్రీ ఏ. అంజయ్యతో పాటు అధికారులు, కానిస్టేబుళ్లు, హోం గార్డులు పాల్గొని అమర వీరులకు నివాళులు అర్పించారు.IMG-20251021-WA0030

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .