వేమన శతక పుస్తక పంపిణీ కార్యక్రమం ప్రారంభం.!

ఆషా సంస్థ విద్యార్ధులకు ఉచితంగా రెండు వేల పుస్తకాలు అందిస్తోంది.

వేమన శతక పుస్తక పంపిణీ కార్యక్రమం ప్రారంభం.!

WhatsApp Image 2025-10-23 at 5.30.50 PM

సత్తుపల్లి, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

ఆషా స్వచ్ఛంద సంస్థ ప్రచురించిన వేమన శతక పుస్తకాలను ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ పంపిణీ చేశారు. గురువారం సత్తుపల్లిలో జరిగిన కార్యక్రమంలో దయానంద్ మాట్లాడుతూ, ఆషా సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల వేమన శతక పుస్తకాలను ప్రచురించినట్లు తెలిపారు.

సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ పుస్తకాలను విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్ధులు వంద పద్యాలు నేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కూడా దయానంద్ కోరారు.

గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన రాజు, వేమన పద్యాలు మాతృభాష అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!