ప్రజల ఆరోగ్యం కోసం యువ డాక్టర్ల ముందడుగు ఎమ్మెల్యే

మర్రి రాజశేఖర్ రెడ్డి

ప్రజల ఆరోగ్యం కోసం యువ డాక్టర్ల ముందడుగు ఎమ్మెల్యే

మల్కాజ్‌గిరి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని వాణి నగర్‌లో సంతోషి డెంటల్ హాస్పిటల్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్‌తో కలిసి హాస్పిటల్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వాణి నగర్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో యువ వైద్యులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.ఈకార్యక్రమంలో డాక్టర్ సంతోషి, డాక్టర్ సిద్ధార్థ వర్మ కృష్ణ చావ్లి, ప్రవీణ్, కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .