సత్తుపల్లి డిపోలో ఆర్టీసీ వినూత్న కార్యక్రమం ప్రారంభం.

ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం, సేవలో కొత్తదనం.

సత్తుపల్లి డిపోలో ఆర్టీసీ వినూత్న కార్యక్రమం ప్రారంభం.

సత్తుపల్లి, అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రయాణికులను ఆత్మీయంగా పలకరించి, సేవలో స్నేహభావాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం గురువారం సత్తుపల్లి డిపోలో డిపో మేనేజర్ ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో ప్రారంభమైంది.

బస్సు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో, ప్రయాణానికి పట్టే సమయం, మధ్యలో ఆగే స్టాప్‌లు వంటి వివరాలను డ్రైవర్, కండక్టర్‌లు ప్రయాణికులకు వివరించారు. ఆర్టీసీ సేవలను ఆదరించడంతో పాటు సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.


WhatsApp Image 2025-10-23 at 2.10.39 PMఆర్టీసీ ఎండి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, సంతృప్తి కోసం సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సిబ్బంది పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి. విజయశ్రీ, డిపో సిబ్బంది పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!