విద్యుత్ వినియోగదారుల దినోత్సవం

కీసర డివిజన్ విద్యుత్ అధికారుల ప్రజలతో సమావేశం

కీసర, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు)

కీసర డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు నాగారం వద్ద కె.కె. గార్డెన్ ఎదురుగా ఉన్న విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.ఈ సందర్భంగా వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, అర్జీలు, సలహాలను నేరుగా అధికారులకు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. బిల్లుల సమస్యలు, వోల్టేజ్ లోపాలు, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, మీటర్ లోపాలు, కొత్త కనెక్షన్లు మరియు ఇతర సేవలకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించబడనున్నాయి.“ప్రజల ఫిర్యాదులు వెంటనే స్వీకరించి, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం” అని డివిజనల్ ఇంజనీర్ తాళ్లపల్లి లింగయ్య తెలిపారు. ఈ సమావేశానికి ఏఈలు, జేఈలు మరియు లైన్ స్టాఫ్‌ తదితర అధికారులు హాజరుకానున్నారు.విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సమావేశానికి హాజరై తమ సమస్యలను తెలియజేయాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.
 *వినియోగదారులకు సూచనలు:
బిల్లులు లేదా మీటర్ వివరాలు వెంట తీసుకురావాలి ఫిర్యాదు వివరాలు రాతపూర్వకంగా ఇచ్చితే వేగంగా పరిష్కారం గృహాలయాలు,వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు హాజరు కావచ్చును

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!