గ్రూప్-1 ర్యాంకర్లను సన్మానించిన ఎమ్మెల్యే నాయిని

గ్రూప్-1 ర్యాంకర్లను సన్మానించిన ఎమ్మెల్యే నాయిని

హనుమకొండ,అక్టోబర్21 (తెలంగాణ ముచ్చట్లు):

ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో హనుమకొండ జిల్లాకు గర్వకారణంగా నిలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.గ్రూప్-1లో ప్రతిభను చాటిన బండారి అన్వేష్ (డీఎస్‌పీ), సంఘాల జశ్వంత్ రాజ్ (డీఎస్‌పీ), పోతరాజు పవన్ (మునిసిపల్ కమిషనర్) లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ — హనుమకొండ జిల్లాకు చెందిన మేధావులు అత్యున్నత స్థాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడం గర్వకారణమని, ఇది యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా నియోజకవర్గం నుంచి మరెందరో యువతి యువకులు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని, ఉద్యోగ నియామక పత్రాలను సీఎం చేతుల మీదుగా అందుకోవడం మరింత గౌరవకరమైన విషయమని తెలిపారు.
పేద ప్రజలకు న్యాయం అందేలా, సమాజ అభివృద్ధికి కొత్తగా ఎంపికైన అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే నాయిని సూచించారు.IMG-20251021-WA0024

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!