కాంగ్రెస్ కార్యాలయానికి  భూమి కేటాయింపు

సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం

కాంగ్రెస్ కార్యాలయానికి  భూమి కేటాయింపు

స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం

•సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 23, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి ప్రభుత్వ భూమి ఎకరం కేటాయిస్తూ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పాత భవనం కావడం, అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు చేయాలని మంత్రి తుమ్మలకు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ 21 ఫిబ్రవరి 2024 న వినతి పత్రం అందజేశారు. దీంతో మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.  గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఖమ్మం నగరంలోని బురాన్ పురం లో గల ఎన్ఎస్పి స్థలం సర్వేనెంబర్ 93 లో ప్రభుత్వ భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపారు. నూతన కార్యాలయం నిర్మాణానికి ఎన్.ఎస్పీ లో ఎకరం భూమి కేటాయింపు చేస్తూ  నిర్ణయం తీసుకుంది. నూతన జిల్లా పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లకు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లి విరుస్తుంది.IMG-20251023-WA0035

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .