మండల ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి.!
ఎమ్మెల్యే జారె.
Views: 16
On
అశ్వరావుపేట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
అన్నపురెడ్డిపల్లి మండలానికి కొత్త ఎమ్మార్వోగా నియమితులైన గంట ప్రతాప్ గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ, మండల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
గ్రామస్థాయి సర్వేలు, భూసంబంధిత రికార్డులు, పంచాయతీ వ్యవస్థల్లో పారదర్శకత పెంపొందించడం అవసరమని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు అందే సేవల్లో నాణ్యత, సమయపాలన ఉండాలని అన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జారె తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments