వేలేరు పిహెచ్‌సీ లో సమస్యల పర్వం,పట్టించుకోని అధికారులు! 

వేలేరు పిహెచ్‌సీ లో సమస్యల పర్వం,పట్టించుకోని అధికారులు! 

వేలేరు,నవంబర్03(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సీ)లో పలు సమస్యలు నెలకొని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వైద్యసేవలు అందించే సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడం, పరికరాలు సరిగా పనిచేయకపోవడం, పరిశుభ్రత లోపించడం వలన రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.WhatsApp Image 2025-11-03 at 8.43.41 PMWhatsApp Image 2025-11-03 at 8.43.40 PM (1)WhatsApp Image 2025-11-03 at 8.43.41 PM (1)

సిబ్బంది విధుల వివరాలు బోర్డుపై పొందుపరచకపోవడం, సమాచారం కోసం అడిగినపుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, పురుషుల కోసం వేర్వేరు సూచిక బోర్డులు లేకపోవడం కూడా అసౌకర్యానికి కారణమవుతోంది.

అదనంగా, వాక్సిన్ నిల్వ ఉంచే రిఫ్రిజిరేటర్ చెడిపోయి మరమ్మతులో ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. అయితే రక్త, మూత్ర, కిడ్నీ, లివర్‌ పరీక్షల కోసం అవసరమైన పరికరాలు, అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.ప్రజలు ఆరోగ్య కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేసేలా పరిశుభ్రత, పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు అధికారుల దృష్టి సారించాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .