వెల్టూర్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
పెద్దమందడి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అశోక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సర్పంచ్ అశోక్ కోరారు.ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments