గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై పోసిన మట్టి -బురదమయంగా మారిన రోడ్డు .
Views: 85
On
వేలేరు, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలోని గాంధీ విగ్రహం సమీపంలో రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు మట్టి పోయడంతో వర్షాకాలంలో ఆ ప్రాంతం బురదమయంగా మారింది. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే గుర్తించి రోడ్డును శుభ్రపరిచి ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments