15వ బెటాలియన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

15వ బెటాలియన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

సత్తుపల్లి, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు): 

బి.గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు పటాలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పటాలపు కమాండెంట్ ఎన్. పెద్దబాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎన్. పెద్దబాబు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. వారి ఆశయాల సాధనకు ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాలంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది పిల్లలకు కమాండెంట్ ఎన్. పెద్దబాబు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు ఆనందోత్సాహాలతో స్వీట్లు స్వీకరించారు. కార్యక్రమంలో పటాలపుIMG-20260815-WA0017 సహాయ దళాధిపతి బి. వేణుగోపాల్ రెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .