సండ్రా జన్మదినం సందర్భంగా ఉచిత మంచినీటి ట్యాంకర్.

కేక్‌ కట్‌ చేసి వేడుకలు.. ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమం.

సండ్రా జన్మదినం సందర్భంగా ఉచిత మంచినీటి ట్యాంకర్.

సత్తుపల్లి, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు): 

మాజీ ఎమ్మెల్యే, సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకుడు సండ్రా వెంకట వీరయ్య జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ సత్తుపల్లి 2వ వార్డు కౌన్సిలర్‌ వీరపనేని రాధిక బాబి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేసి సండ్రా వెంకట వీరయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.IMG-20260815-WA0009 అనంతరం వీరపనేని రాధిక బాబి దాతలుగా ఉచిత మంచినీటి ట్యాంకర్‌ను ప్రారంభించారు. పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా ఈ ట్యాంకర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉచిత మంచినీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. తాగునీటి అవసరాలు ఉన్న సమయంలో ఈ సేవ పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాన్ని చేపట్టిన వీరపనేని రాధిక బాబిని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందించారు. ఈ సందర్భంగా ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ ప్రజలకు వీరపనేని రాధిక బాబి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ కూసుంపూడి మహేష్‌, మాజీ ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొని సండ్రా వెంకట వీరయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .