పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.

పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.

వేలేరు, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు):

 ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడాన్ని వేలేరు మండల బీఆర్ఎస్ నాయకుడు కొయ్యడ మహేందర్ తీవ్రంగా ఖండించారు. పేదల సంక్షేమానికి సంబంధించిన కీలకమైన పథకంపై ప్రభుత్వం కోర్టులో సరైన సమయంలో కౌంటర్ దాఖలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.1,00,116 వరకు ఆర్థిక సాయం అందుతోందన్నారు. పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌లో ప్రభుత్వం సమర్థవంతంగా తన వాదన వినిపించాల్సి ఉండగా, కౌంటర్ దాఖలులో జాప్యం చేయడం వల్లే కోర్టు స్టే విధించే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.
పేద కుటుంబాల్లో వివాహాలు చేసుకునే వారికి ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, వాటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే కోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించి స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల సాయం అందేలా చూడాలని కొయ్యడ మహేందర్ డిమాండ్ చేశారు. పేదల సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా కొనసాగించాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా...
ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.
పోచమ్మ తల్లి ఆలయంలో బోరుబావికి శ్రీకారం.
పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.
విద్యారంగ సమస్యలపై యూఎస్పీసీ సమరభేరి.
సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.
IIIT సీటు సాధించిన హాసినికి సర్పంచ్ ఆర్థిక సాయం.