తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయండి.

డాక్టర్ పిడమర్తి రవి , డాక్టర్ కె.వి కృష్ణారావు.

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయండి.

ఖమ్మం బ్యూరో, ఆగస్టు 10(తెలంగాణ ముచ్చట్లు )

రెండు తరాల తెలంగాణ ఉద్యమాకారులను సుమారుగా లక్ష మందిని గుర్తించండి కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందని , అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ పిడమర్తి రవి , డాక్టర్ కె.వి కృష్ణారావు అన్నారు . చిన్నారి హాస్పిటల్ డైరెక్టర్ ఆఫీస్ లో రెండు తరాల తెలంగాణ ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం కరపత్రాన్ని జమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి , తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కె.వి కృష్ణారావు మరియు మిగతా నాయకులతో కలిసి ఆవిష్కరించారు . తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలు ఉద్యమంలో గాయపడిన వారు ఆగిపోయింది జైలుకుపోయిన వారు ఉద్యమం నడిపిన వారు సంఘాలు ఏర్పాటు చేసిన వాళ్లు అందరిని కలిపి లక్ష మందిని గుర్తించాలని వారికి 250 చదరపు గజాల స్థలం మరియు పెన్షన్ , గుర్తింపు కార్డులు ఇవ్వాలని పిడమర్తి రవి కోరారు . సెప్టెంబర్ 16న హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే అపూర్వ సమ్మేళనానికి 1969 - 2009 ఉద్యమకారులు హాజరుకావాలని కోరారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దేవి రెడ్డి విజయ్ , మట్టి గురుమూర్తి , జిల్లా విజయ్ , రాకేష్ , భూక్య హరినాయక్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:

Post Your Comments

Comments

Latest News

కేంద్ర విధానాలపై ప్రజా సంఘాల పోరుబాట. కేంద్ర విధానాలపై ప్రజా సంఘాల పోరుబాట.
జమ్మికుంట, టౌన్ ఆగస్టు 10 (తెలంగాణ ముచ్చట్లు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ...
కనపర్తిలో కాంగ్రెస్‌ బలోపేతానికి కొత్త కమిటీ.
అర్చకుల సంక్షేమానికి అంకితమైన నాయకత్వం.
ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన విద్యే ధ్యేయం.
అనుమతుల్లేకుండా ఇసుక తరలింపు.. ఐదు ట్రాక్టర్లపై కేసులు.
సవాల్ విసిరితే బీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కడ?
రైతుకు నీళ్లు ఇస్తే స్వాగతిస్తాం.. ఇవ్వకపోతే ఉద్యమిస్తాం.