రోడ్డు ప్రమాద బాధిత చిన్నారికి అండగా సబ్బాని వెంకట్.

ఆస్పత్రిలో పరామర్శ.. రక్తదానం సమన్వయం, 50 కిలోల బియ్యం అందజేత.

రోడ్డు ప్రమాద బాధిత చిన్నారికి అండగా సబ్బాని వెంకట్.

జమ్మికుంట , ఆగస్టు 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు కొయ్యడ మధు కుమార్తె అక్షర (8)ను సామాజికవేత్త సబ్బాని వెంకట్ బుధవారం పరామర్శించారు.
హస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలానికి చెందిన అక్షర ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో చిన్నారికి కుడి చేయి, కుడి కాలు విరగడంతో ఇప్పటికే ఒక శస్త్రచికిత్స నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా సబ్బాని వెంకట్ ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులను కలిసి చిన్నారికి అత్యుత్తమ వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. చికిత్సకు అవసరమైన బి-నెగెటివ్ రక్తాన్ని అందించేందుకు రక్తదాతలను సమన్వయం చేసి రక్తదానం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. చిన్నారి పూర్తి ఆరోగ్యంతో కోలుకునే వరకు అవసరమైన వైద్య సహాయం, ఇతర అవసరాల కోసం తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.IMG-20260806-WA0054
సబ్బాని వెంకట్ అందించిన ఆర్థిక, మానవతా సహాయానికి కొయ్యడ మధు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ భావజాలానికి చిరునామా జయశంకర్ సార్: మొలుగు ప్రశాంత్ కుమార్. తెలంగాణ భావజాలానికి చిరునామా జయశంకర్ సార్: మొలుగు ప్రశాంత్ కుమార్.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 06 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరమైన పునాది వేసి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నంతా అంకితం చేసిన...
హుజురాబాద్ అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమీక్ష.
ప్రతి గడపకు సంక్షేమం చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: వొడితల ప్రణవ్.
వివేకానంద విగ్రహం తొలగింపు అవసరం లేదు: హైకోర్టు.
రోడ్డు ప్రమాద బాధిత చిన్నారికి అండగా సబ్బాని వెంకట్.
కాంగ్రెస్ సీనియర్ నేత సొల్లు బాబు జన్మదిన వేడుకలు.
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: కౌశిక్ రెడ్డి.