జమ్మికుంటలో సింథటిక్ ట్రాక్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.

రూ.6.50 కోట్ల మంజూరు.

జమ్మికుంటలో సింథటిక్ ట్రాక్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.

జమ్మికుంట,ల్ టౌన్ ఆగస్టు 04 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రూ.6.50 కోట్ల వ్యయంతో 400 మీటర్ల, నాలుగు లేన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణా సదుపాయాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టుకు రూ.6.50 కోట్ల నిధులు ఆమోదించినట్లు తెలిపారు.
ఈ ట్రాక్ నిర్మాణం పూర్తయితే జమ్మికుంటతో పాటు పరిసర ప్రాంతాల క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణా వేదిక అందుబాటులోకి రానుంది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అథ్లెట్ల ప్రతిభను మరింత మెరుగుపర్చేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

శిశు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం. శిశు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం.
పెద్దమందడి,ఆగస్టు04(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మంగంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను అంగన్‌వాడీ టీచర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రమేష్ హాజరయ్యారు....
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
బీజేపీకి భారీ ఎదురుదెబ్బ.. బీఆర్‌ఎస్ గూటికి ముగ్గురు సర్పంచ్‌లు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాటలో సీపీఐ
ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై సీపీఎం ఆందోళన.
ఇంటి సరిహద్దు వివాదం ముగ్గురు అరెస్ట్.
పరిమళ కాలనీ వాసులకు ఉచిత వైద్య సేవలు.