వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.
* 55 పోలింగ్ కేంద్రాల్లో వేగంగా ప్రక్రియ.
* కేవలం 767 ఫారాలు మాత్రమే పెండింగ్.
వీణవంక, ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక మండల వ్యాప్తంగా 'సర్' ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 99 శాతం పూర్తయినట్లు తహశీల్దార్ ముద్దసాని రమేష్ తెలిపారు. మండలంలోని మొత్తం 55 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 43,260 మంది ఓటర్లలో ఇప్పటికే 38,565 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు వెల్లడించారు.
మండలంలోని 18 పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం కేవలం 767 ఫారాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే 3,928 మంది ఓటర్లు వలస వెళ్లడం లేదా మరణించడం వంటి కారణాలతో వారి వివరాలను గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసి, ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తహశీల్దార్ వివరించారు.


Comments