పెద్దమందడిలో ఎస్ఐఆర్ ప్రక్రియ 89 శాతం పూర్తి.
పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్.
Views: 0
On
పెద్దమందడి,జూలై29(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ 89 శాతం పూర్తయిందని తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు. ఇంకా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకోని వారు త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, సంబంధిత సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. డబుల్ ఓట్లు కలిగిన వారి వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి, నిబంధనల మేరకు తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు.మిగిలిన వారు సకాలంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకునేలా సహకరించాలని కోరారు. త్వరలోనే మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేస్తామని తహసీల్దార్ మల్లికార్జున్ ధీమా వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
29 Jul 2026 20:58:37
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...


Comments