కులం పేరుతో దూషించి దాడి చేసిన 11 మందికి ఏడాది జైలు శిక్ష...

కులం పేరుతో దూషించి దాడి చేసిన 11 మందికి ఏడాది జైలు శిక్ష...

మహబూబ్‌నగర్,15(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో ఓ రిపోర్టర్‌పై కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడిన కేసులో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును విచారించిన న్యాయస్థానం 11 మంది నిందితులను దోషులుగా తేల్చి, ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది.2021లో అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోందని సంబంధిత అధికారులకు సమాచారం అందించిన రిపోర్టర్‌పై నిందితులు కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, వాదనలను పరిశీలించిన అనంతరం నిందితులపై నమోదైన అభియోగాలు రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది.బాధితుడిపై కులం పేరుతో దూషించడం, దాడికి పాల్పడటం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.ఈ తీర్పుతో బాధితుడికి న్యాయం జరిగినట్లుగా భావిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులపై దాడులు, అలాగే ఎస్సీ, ఎస్టీ అఘాయిత్యాల కేసుల్లో చట్టం కఠినంగా అమలవుతుందనే సందేశాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.