భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారుల సమావేశం.
Views: 113
On
భీమదేవరపల్లి,జూన్29(తెలంగాణ ముచ్చట్లు):
భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గౌరవ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఇచ్చిన ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటును వేగవంతం చేసి, గ్రామాల భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులు సూచించారు. గ్రామస్థుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని
కోరారు.
ఈ కార్యక్రమంలో ముల్కనూరు ఎస్ఐ రాజు, వంగర ఎస్ఐ దివ్య ఎంపీవో, ఎంపీడీవో, ఎమ్మార్వోతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments