రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి..
గుర్తించాలని పోలీసుల విజ్ఞప్తి.
ధర్మసాగర్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగరం మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన గుర్తుతెలియని మహిళను గుర్తించేందుకు పోలీసులు ప్రజల సహకారం కోరుతున్నారు.రాంపూర్ గ్రామ శివారులోని రంగసముద్రం చెరువు సమీపంలో జాతీయ రహదారి-163పై గుర్తుతెలియని వాహనం మహిళను ఢీకొట్టి పరారైంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు, 108 సిబ్బంది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది.మృతురాలు సుమారు 55 సంవత్సరాల వయస్సు, 5.5 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆకుపచ్చ రంగు చీర, లేత ఆకుపచ్చ రంగు జాకెట్ ధరించి ఉంది. ఆమె భిక్షాటన చేసే మహిళగా కనిపిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ మహిళను ఎవరైనా గుర్తించినా, ఆమె కుటుంబ సభ్యులు లేదా బంధువుల వివరాలు తెలిసినా వెంటనే ఈ నంబర్లకు ఫోన్ చేసి 8712685010, 8712675127 ధర్మసాగర్ పోలీసులను సంప్రదించాలని కోరారు. మృతదేహం ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచి ఉంచినట్లు తెలిపారు.


Comments