అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.

- యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపు.

-  ప్రధాని మోదీ సేవలను కొనియాడిన నేతలు.

జమ్మికుంట టౌన్ జూన్ 21(తెలంగాణ ముచ్చట్లు):

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో యోగా గురువు దాసరి రవీందర్ నేతృత్వంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కొలకాని రాజు, ఆకుల రాజేందర్, శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది భారతీయ సంస్కృతికి ప్రతీక అని, వేల సంవత్సరాల క్రితమే యోగులు, ఋషులు యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని నిరూపించారని తెలిపారు. విదేశీ పాలనలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దెబ్బతగిలిందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగా విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు.

ప్రపంచ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, ఆయన కృషి ఫలితంగానే నేడు ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయని కొనియాడారు.

యోగాతో శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాజేష్ ఠాకూర్, కైలాసకొటి గణేష్, ఆకుల తిరుపతి, కొండ్లె నగేష్, రాకేష్ ఠాకూర్, రమారెడ్డి, గంగాభవాని, పల్లపు రవి, నసీరుద్దీన్, బల్సుకూరి రాజేష్, అప్పాల రవీందర్, యాంసాని సమ్మయ్య, గండికోట సమ్మన్న తదితరులు పాల్గొన్నారు.IMG-20260621-WA0071

Tags:

Post Your Comments

Comments

Latest News

అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి.
అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి పనిచేయని సీసీ కెమెరాలే దొంగలకు అండా..? వేలేరు, జూన్ 21 (తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం...
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.
మృతుడి పిల్లల చదువులకు చేయూత.. రూ.1.36 లక్షల విద్యా సహాయ నిధి అందజేత.
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం .
రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు.
సత్తుపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల.
పామాయిల్‌తో రైతు కుటుంబాల్లో వెలుగులు.