వేలేరు గ్రామానికి రూ.45 లక్షల నిధులు మంజూరు.

వేలేరు గ్రామానికి రూ.45 లక్షల నిధులు మంజూరు.

వేలేరు, జూన్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మేజర్ గ్రామంలోని సీసీ రోడ్ల అభివృద్ధి కోసం మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.45 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు ప్రొసీడింగ్స్ కాపీని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్ కత్తి సంపత్లకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ, గ్రామంలోని సీసీ రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి రూ.45 లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు.
గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఆయన సహకారంతో వేలేరు గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని సర్పంచ్ బిల్లా యాదగిరి పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

స్కూల్ జోన్‌లో పోలీసుల ఉక్కుపాదం.. పాన్, బెల్ట్ షాపులపై విస్తృత తనిఖీలు. స్కూల్ జోన్‌లో పోలీసుల ఉక్కుపాదం.. పాన్, బెల్ట్ షాపులపై విస్తృత తనిఖీలు.
జమ్మికుంట టౌన్ జూన్ 19 (తెలంగాణ ముచ్చట్లు): విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు....
వేలేరు గ్రామానికి రూ.45 లక్షల నిధులు మంజూరు.
పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.
భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!
ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.
ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"