ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా.

ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా.

హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) సాధన కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్‌టీఐ సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో చెల్పూర్ గ్రామ ఆర్‌టీఐ సాధన కమిటీ నూతన అధ్యక్షుడిగా ఆకునూరి కుమారస్వామిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆకునూరి కుమారస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్, కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడు ఎం. రాజు, హుజూరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బండ నరేందర్‌తో పాటు కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆర్‌టీఐ వేదికగా నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.
నూతన అధ్యక్షుడి ఎన్నికతో చెల్పూర్ గ్రామంలో ఆర్‌టీఐ సాధన కమిటీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
- ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం జమ్మికుంట టౌన్ జూన్...
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.
భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!
ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.
ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"
ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.