ఖమ్మం ప్రయాణికులకు గుడ్‌న్యూస్.

సత్తుపల్లి నుంచి వేగవంతమైన డీలక్స్ సర్వీసులు ప్రారంభం.

ఖమ్మం ప్రయాణికులకు గుడ్‌న్యూస్.

సత్తుపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి-ఖమ్మం మధ్య ప్రయాణించే వారికి సమయ ఆదా కల్పించేలా ఆర్టీసీ ప్రత్యేకంగా ‘3 స్టాప్స్’ డీలక్స్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ డీలక్స్ బస్సులకు వీఎం బంజర, కల్లూరు, వైరా ప్రాంతాల్లో మాత్రమే స్టాపులు కల్పించినట్లు చెప్పారు. దీంతో సత్తుపల్లి నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి సత్తుపల్లి ప్రయాణించే వారికి ప్రయాణ సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. సత్తుపల్లి నుంచి ఉదయం 7:00, 7.30, 8:00 గంటలకు, మధ్యాహ్నం 11.45, 12.15, 1:00 గంటలకు, సాయంత్రం 4.30, 5:00, 5.40 గంటలకు బస్సులు బయలుదేరనున్నాయి. అలాగే ఖమ్మం నుంచి ఉదయం 9.20, 9.45, 10.15 గంటలకు, మధ్యాహ్నం 2.15, 2.50, 3.30 గంటలకు, సాయంత్రం 6.40, 7.15, రాత్రి 8:00 గంటలకు సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక డీలక్స్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు
భీమదేవరపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా...
మార్నింగ్ వాక్‌లో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి సందర్శన.
ప్రజల భద్రత కోసం కెమిస్టుల బంద్.. జమ్మికుంటలో ఐక్య నిరసన.
కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
దేవాదాయ శాఖ నిర్ణయానికి అర్చకుల కృతజ్ఞతలు.