ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం .

వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు.

ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం .

పెద్దమందడి,మే03(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ న్యూ ఎస్సీ కాలనీకి చెందిన దయ్యాల పద్మ(కీర్తిశేషులు దయ్యాల నాగేష్) నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. దయ్యాల పద్మ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ నాయకులు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు.దయ్యాల పద్మ నూతన గృహ నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం జరుపుకోవడం ఆనందదాయకమని, ఆమె కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.గ్రామ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామం మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, వార్డు సభ్యులు నాగభూషణ్, మద్దూర్ నరసింహ, గుండెల ఆంజనేయులు, మద్దూర్ వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు, శ్యాంసుందర్, కుటుంబ సభ్యులు సురేష్, భరత్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

భక్తి ఉత్సాహంలో హుజురాబాద్ – ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా. భక్తి ఉత్సాహంలో హుజురాబాద్ – ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా.
హుజురాబాద్ మే 3(తెలంగాణ ముచ్చట్లు ):   హుజురాబాద్ పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా...
42 రోజుల పోరాటానికి బ్రేక్…
నేతల సమక్షంలో కొమురమ్మకు నివాళులు అర్పణ.
జమ్మికుంటలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం .
చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం.
ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం.