సత్తుపల్లి వసతి గృహం విద్యార్థుల మెరుగైన ప్రతిభ.

వంద శాతం ఉత్తీర్ణత నమోదు.

సత్తుపల్లి వసతి గృహం విద్యార్థుల మెరుగైన ప్రతిభ.

సత్తుపల్లి, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు):
 
సత్తుపల్లి బాలుర వసతి గృహానికి చెందిన విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచారు. మొత్తం 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై, అందరూ ఉత్తీర్ణత సాధించి వంద శాతం ఫలితాన్ని నమోదు చేశారు.
విద్యార్థులలో 4 మంది 500కు పైగా మార్కులు సాధించగా, మరో 5 మంది 450కు పైగా మార్కులు సాధించడం గమనార్హం. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు కష్టపడి చదివితే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో ఈ విజయంతో మరోసారి రుజువైంది. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వసతి గృహ సంక్షేమ అధికారి ఎం. రమేష్ అభినందించారు. విద్యార్థుల కృషి ఫలితంగా ఈ విజయాన్ని సాధించారని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .