ఇందిరమ్మ ఇల్లు… కలల గడప దాటిన సంతోషం.

గృహ ప్రవేశంలో మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు… కలల గడప దాటిన సంతోషం.

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
 
పేదల కలల్ని సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో కుటుంబంలో ఆనంద దీపాలు వెలిగించింది. జమ్మికుంట పట్టణ పరిధిలోని 16వ వార్డులో పల్లపు ఉమ–రమేష్ దంపతుల నూతన గృహ ప్రవేశం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. కొత్త ఇంటి గడప దాటిన ఆ కుటుంబం ఆనందం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఈ సంతోష క్షణాలను పంచుకునేందుకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ స్వయంగా హాజరై, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. “ఇల్లు అంటే కేవలం గోడలు కాదు… కుటుంబానికి భద్రత, గౌరవం, భవిష్యత్తుకు నమ్మకం” అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈ నస్రత్ పాషా, కోలుగురి కుమారస్వామి, జక్కే ప్రేమ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని, కొత్త IMG-20260429-WA0101ఇంటి యజమానులకు అభినందనలు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను మరింత ఉత్సాహంగా మార్చారు.
Tags:

Post Your Comments

Comments

Latest News