బోటి గుట్టపై మల్లన్న జాతర జోష్.
భోనాలు, పట్నాలతో సిర్సపల్లి ఉత్సాహం
Views: 2
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ మండలం సిర్సపల్లిలోని బోటి గుట్ట వద్ద వెలసిన స్వయంభు ఐలోని మల్లన్న స్వామి ఆలయంలో ఆదివారం భోనాలు, పట్నాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జాతర సందర్భంగా పరిసర గ్రామాలైన రంగాపూర్, రాంపూర్కు చెందిన మహిళలు సంప్రదాయ దుస్తుల్లో తలపై భోనాలు ఎత్తుకొని గ్రామ వీధుల గుండా ఊరేగిస్తూ భక్తి పరవశంతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఒగ్గు కళాకారులు ఒగ్గు కథలను వినిపిస్తూ, ఒగ్గు డోలు మోగిస్తూ మల్లన్న స్వామి మహిమను గాన రూపంలో వినిపించారు. కోలాటం ప్రదర్శనలు, జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భక్తులు సంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లించుకుంటూ, స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. మొత్తం మీద సిర్సపల్లిలో మల్లన్న జాతర భక్తి, సంప్రదాయం, సంస్కృతి కలబోతగా వైభవంగా కొనసాగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 Apr 2026 22:18:43
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )
స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం నగరంలోని...


Comments