ప్రజలకు ఉపయోగపడని వైకుంఠదామం .
Views: 1
On
వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం ప్రజలకు ఉపయోగపడని స్థితిలో ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ స్మశానవాటికను నిర్మించడంతో అక్కడికి చేరుకోవడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు.ఈ కారణంగా గ్రామ ప్రజలు వైకుంఠధామాన్ని వినియోగించుకోలేకపోతూ, గ్రామంలో ఉన్న జంగం కుంట మరియు ఎల్లమ్మ వాగు వద్దే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన స్మశానవాటిక ప్రజలకు ఉపయోగపడకపోవడంపై పలువురు అధికారులపై మండిపడుతున్నారు.
ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రయోజనం లేకుండా పోతుందని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2026 21:17:30
వనపర్తి,ఏప్రిల్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణం 29వ వార్డుకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం ఎస్.శ్రీనివాసరావును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన...


Comments