ఎంపీ రవిచంద్ర పరామర్శ

ఎంపీ రవిచంద్ర పరామర్శ

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 4(తెలంగాణ ముచ్చట్లు)

ఇటీవల అనారోగ్యానికి గురై ఖమ్మం నగరంలోని స్థంభాద్రి ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న ఖమ్మం వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల భాస్కర్ రావు ను  రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడే చికిత్స పొందుతున్న చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన హరిప్రసాద్ ను కూడా పరామర్శించారు. ఎంపీ రవిచంద్ర వెంట మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకులగాంధీ కూడా ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News