సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం!
ముస్లిం సోదరులతో తుంబూరు దయాకర్ రెడ్డి ఆత్మీయ ఆలింగనం
ఖమ్మం బ్యూరో, మార్చి 21(తెలంగాణ ముచ్చట్లు)
భారతీయ జీవన స్రవంతిలో అంతర్భాగమైన గంగా-జమునా తెహజీబ్కు నిలువుటద్దంగా, మత సామరస్యానికి మకుటాయమానంగా రంజాన్ పర్వదిన వేడుకలు శనివారం జిల్లా కేంద్రంతో పాటు ఏదులాపురం ప్రాంతంలో మిన్నంటాయి. ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
*సంక్షేమ పథకాలపై భరోసా*
ఏదులాపురం మున్సిపాలిటీ మద్దులపల్లిలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ఇందిరమ్మ ప్రభుత్వం మైనారిటీల పక్షపాతి. విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లిం సోదరులకు అండగా ఉంటూ, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మంత్రి పొంగులేటి లక్ష్యం" అని భరోసా ఇచ్చారు.
*ఆత్మీయ ఆతిథ్యం*
పండుగ వేళ ఆత్మీయతను చాటుతూ మద్దులపల్లిలోని ఎస్.కె. జానీ నివాసానికి, ఖమ్మం నగరంలోని సీనియర్ నాయకులు ఎస్.కె. ఇమామ్ భాయ్ గృహానికి వెళ్లిన దయాకర్ రెడ్డి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఈద్ ముబారక్ తెలియజేశారు. ఈ వేడుకల్లో ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్ గొడ్డుగొర్ల కృష్ణకుమార, బైరు కోటేశ్వరరావు, పాలేరు డివిజన్ నాయకులు నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


Comments