కీసర పీఎస్లో ఏసీబీ దాడులు
రూ.35 వేల లంచం తీసుకుంటూ హోంగార్డ్ నగేష్ అరెస్ట్
కీసర, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం దాడులు నిర్వహించి హోంగార్డ్ నగేష్ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు.మృతుడు తోటకూర మహేష్ పోస్ట్మార్టం రిపోర్ట్ అందించాలంటే మొదట రూ.2 లక్షలు ఇవ్వాలని నగేష్ డిమాండ్ చేసినట్లు మృతుడి మేనల్లుడు శరత్ ఆరోపించారు. గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్ పేరు చెప్పి రిపోర్ట్ త్వరగా తెప్పించాలంటే డబ్బులు అవసరమని నమ్మబలికినట్లు తెలిపారు.నెలలు గడిచినా రిపోర్ట్ అందకపోవడంతో చివరకు రూ.40 వేలుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మొదట రూ.5 వేలు తీసుకున్న నగేష్, రెండో విడతగా రూ.35 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిసింది.తోటకూర మహేష్ మృతి చెందిన నాలుగు నెలలు గడిచినా పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.నగేష్ను అదుపులోకి తీసుకున్నఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన కీసర పీఎస్లో సంచలనం రేపింది.


Comments