మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ
జిల్లా సాహితి కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.జిల్లాలో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ అని తెలిపారు. ఈ పండుగ మాఘ మాస కృష్ణ పక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారని పేర్కొన్నారు.అలాగే సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాలు వనపర్తి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.పురాణాల ప్రకారం పరమశివుడు హాలాహలం విషాన్ని మింగి లోకాన్ని రక్షించిన రాత్రిగా, అలాగే శివపార్వతుల వివాహ మహోత్సవంగా మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు భక్తులు బిల్వపత్రాలతో రుద్రాభిషేకాలు చేసి శివారాధన చేస్తారు.మహాశివరాత్రి రాత్రి జాగరణ చేసి శివారాధన చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని, పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.శివుడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా భావించబడతాడు.మహాశివరాత్రి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


Comments